PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన కమిషనర్ కు కౌన్సిలర్ల శుభాకాంక్షలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్ బేబి ని పట్టణ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం ఉ 11 గం.కు నూతన కమిషనర్ ను 26 వ వార్డ్ కౌన్సిలర్ మందడి శ్రీవాణి,2వ వార్డ్ కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్,14 వ వార్డ్ కౌన్సిలర్ మానపాడు అశోక్,5వ వార్డ్ ఇంచార్జ్ సన అబ్దుల్లా,26 వ వార్డ్ ఇంచార్జ్ మందడి రవీంద్రా రెడ్డి,పట్టణ టీడీపీ నాయకులు ముజీబ్, ఆఫ్రిద్,టీడీపీ సోషల్ మీడియా పసుల శ్రీనివాసులు నాయుడు కమిషనర్ ను కలసి పూలబో కేతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు సమస్యల గురించి నూతన మున్సిపాలిటీ కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు వారు తెలిపారు. తర్వాత మారుతి నగర్ టిడిపి నాయకులు తాటిపాటి బ్రదర్స్ అయ్యన్న,ఏసేపు,రమేష్ తది తరులు కమిషనర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *