PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వామి అమ్మవార్లహుండీల లెక్కింపు

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  ఉభయదేవాలయ హుండీల లెక్కింపులో శ్రీశైల ఆలయానికిరూ.3,98,34,583 /-లు నగదు భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించారు. హుండీలో 148 గ్రాముల బంగారం, 6 కేజీల 260 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా 835 యుఎస్ఏ డాలర్లు, 30యూరోలు, 2ఓమన్ రియాల్స్, 2కత్తార్ రియాల్స్, 105 కెనడా డాలర్లు, 2 సింగపూర్ డాలర్లు, 35 ఆస్ట్రేలియా డాలర్లు, 55 యూ.ఏ.ఈ దిర్హమ్సు. 20 సౌది అరేబియా రియాల్స్ 106 మలేషియా రింగిట్స్, 80 థాయిలాండ్ బాట్స్ మొదలైన విదేశీ కరెన్సీ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి రవణమ్మ, పలువురు శాఖాధిపతులు, ఆయా విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

About Author