PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒప్పంద జీవోలు ఇవ్వాలి…

1 min read

కలకత్తా మెడికో విద్యార్థి ని హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఒప్పంద జీవోలు ఇవ్వాలని మరియు కలకత్తా మెడికో విద్యార్థిని పై జరిగిన అత్యాచారం హత్య సంఘటనకు సంబంధించిన నిందితులను వెంటనే శిక్షించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో  డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని హోళగుంద ప్రాథమిక వైద్యాధికారి న్యూటన్ సార్ కి వినతి పత్రం ని ఇవ్వడం జరిగింది.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు  మండల కార్యదర్శి నాగరాజు వెంకటేష్ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సాలోమీ మాట్లాడుతూ ప్రభుత్వం ఆశా వర్కర్లపై పని భారం పెంచుతుంది తప్ప ఆశా వర్కర్లకు వేతనాలు పెంచడం లేదని వారితో ప్రభుత్వం పెట్టి చాకిరి చేయించుకుంటుందని వారు విమర్శించారు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వం లో ఆందోళన నిర్వహిస్తే ప్రభుత్వం దిగివచ్చి ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించడానికి యూనియన్ తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకుందని వారు అన్నారు ప్రభుత్వ కుదుర్చుకున్న ఒప్పంద జీవోలను వెంటనే  ఇవ్వాలని అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన వారిని జీవోలు ఇచ్చేవరకు రిటైర్మెంట్ చేయరాదని కలకత్తా మెడికో విద్యార్థి పై జరిగిన అత్యాచారం హత్య ఘటనపై నిందితులను శిక్షించాలని పని ప్రదేశంలో భద్రత కల్పించాలని మహిళలకు రక్షణ చట్టం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *