PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతు బాంధవుడు రామచంద్రయ్య కు కొత్తపల్లిలో బ్రహ్మరథం…

1 min read

ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐ నాయకులు.

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఇండియా కూటమి బలపరుస్తున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య కు మండలంలోని కొత్తపల్లి, పందికోన గ్రామాలలో పూల వర్షం కురిపించి, ఊరు- ఊరంతా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.సోమవారం సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య, మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్ సిపిఎం మండల కార్యదర్శి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో  కలిసి కొత్తపల్లి, పంది కోన గ్రామాలలోఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ విధానాలు దేశానికి ప్రమాదకరంగా ఉన్నాయని, గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చింది లేదన్నారు. మోడీ మూడోసారి అధికారంలోకి  వస్తే రాజ్యాంగాన్ని మార్చివేసి, దేశాన్ని కాషా యికరణ చేసేందుకు పూనుకుంటారని విమర్శించారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో మోడీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిస్తున్న తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లను ఓడించి ఇంటికి సాగనంపాలన్నారు. ఇండియా కూటమి బలపరుస్తున్న అభ్యర్థులను  గెలిపించినట్లయితే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా జిల్లాలో 106 చెరువులకు నీళ్లు నింపుతామన్నారు. కొత్తపల్లి- పందికోన రిజర్వాయర్ కింద ఉన్న కుడి, ఎడమ కాలువ పనులను పూర్తి చేసి పదివేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రామచంద్రయ్య కంకి కొడవలి గుర్తుకు, కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రాం పుల్లయ్యయ.

About Author