PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ సర్వజ్ఞ కిడ్స్ యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి…!

1 min read

పల్లెవెలుగు  వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో పర్మిషన్ లేనటువంటి సర్వజ్ఞ కిడ్స్ అక్రమ అడ్మిషన్లు, స్కూల్ ని సీజ్ చేయాలని ఈరోజు పీ ఎస్ యు ప్రగతిశీల విద్యార్థి సంఘం, ఆర్ యు ఎస్ ఎఫ్ రాయలసీమ యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో తహసిల్దార్ చిరంజీవి కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా పీ ఎస్ యు జిల్లా కార్యదర్శి సురేష్,ఆర్ యు ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రఘనాథ్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో విద్యా సంవత్సరం మొదలుకాకముందే ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా  సర్వజ్ఞ కిడ్స్  పాఠశాల అక్రమ అడ్మిషన్లు, రంగు రంగుల పాంప్లెంట్లు, పోస్టర్లు వెలుగులోకి  రావడం జరుగుతుందని ఇదే కాకుండా ఈ స్కూలుకి విద్యాశాఖ అనుమతులు ఎటువంటి పర్మిషన్లు లేకపోయినా కూడా అడ్మిషన్ల కొరకు రంగురంగు కరపత్రాలతో ప్రతి ఇంటి ముంగట ప్రతి ఇంటి పాంప్లెట్స్  లు,న్యూస్ పేపర్ లో ఈ పంప్లేట్స్ కనబడడం జరుగుతున్న కూడా  విద్యాధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తనట్లు వ్యవహరిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తును  మొగ్గలోని  తుంచి వేస్తున్నానని వారు వాపోయారు.ఇకనైనా విద్యాధికారం నిద్ర మబ్బులు వీడి అక్రమ అడ్మిషన్లు చేస్తున్నటువంటి ఈ స్కూలు సీజ్ చేసి, ఈ స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనివారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు.రవి, కుమార్, రాజు,రాము,తదితర నాయకులు పాల్గొన్నారు.

About Author