PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేలైన వ్యవసాయ సాగు పద్ధతులతో కంది పొలం బడి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : మండల పరిధిలోని గని గ్రామంలో గ్రామ సభలో పొలంబడిని 30 మంది రైతులతో 25 ఎకరాలలో 14 వారాలపాటు చేయాలని గ్రామ సభ లో వ్యవసాయ శాఖ అధికారులు. తీర్మానం చేశారు అనంతరం విధివిధానాలను తెలియజేశారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడి పర్యావరణ అనుకూలమైన ఆరోగ్యకరమైన పంటను పండించడం ఎలా అనే దానిపై అవగాహన కల్పించారు. రోజు పంట పొలాన్ని సందర్శించడం మొదలుపెట్టుకొని ఆరోగ్యం కరమైన పంట పండించడం. పొలం బడిలో చేసే కార్యక్రమాలలో భాగమవడం. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఎన్నుకొని. రైతుల పేర్లను రిజిస్టర్ చేయించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.

About Author