PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి… సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయం : శ్రీశైలం ఎమ్మెల్యే

1 min read

సంక్షోభం లోనూ అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్న ఘనత ఎన్డీయే ప్రభుత్వానిది,

గత టిడిపి హయంలోనే గ్రామాభివృద్ధి, ఇంటింటికీ సంక్షేమం..

వైసిపి హయంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం, ప్రజా సంక్షేమం గాలికి,

తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతు కొవ్వు పదార్థాలు కలిసిన కల్తీ నెయ్యిని వాడిన దుర్మార్గులు వైసిపి నేతలు.

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు : రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయ మని శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. శనివారం బోయరేవుల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సర్పంచ్‌ పెద్ద స్వామన్న అధ్యక్షతన నిర్వహించారు. 100 రోజుల్లో ప్రభుత్వం ఉమ్మడి మ్యానిఫెస్టోలు తెలిపిన విధంగా పెన్షన్లు రూ.4వేలకు పెంపు, మెగా డీఎస్సీ, గ్రామీణ అభివృద్ధికి పంచాయతీకి నిధులు, అన్నక్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5లకే భోజనం, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేసినట్లు ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. వైసిపి పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని ఏ శాఖలోనూ ఒక్క రూపాయి నిధులు లేకుండా దోచేసి సంక్షోభంలోకి నెట్టేశారని అన్నారు, అలాంటి సంక్షోభ సమయంలో నమ్మకంతో ఎన్డీయే కూటమిని గెలిపించిన ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీయే కూటమి అని ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. పంచభూతాలను దోచేయడమే కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో జంతు కొవ్వు పదార్థాలు కలిసిన కల్తీ నెయ్యిని వాడి శ్రీవారి సొమ్మును దోచేయడంతో పాటు కోట్లాది హిందువుల మనోభావాలను నాటి వైసిపి ప్రభుత్వం దెబ్బతిసిందని అన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. బోయరేవుల గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేశామని, అలాగే ఇంటింటికీ త్రాగునీరు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇంటి స్థలం, పక్కా గృహాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే బుడ్డా అన్నారు. అంతకు ముందు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి ని ఘనంగా సన్మానించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *