PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు తోనే సాధ్యం

1 min read

ప్రతిపక్ష హోదా లేని వైకాపా వంద రోజుల్లో వంద రకాలుగా  విష ప్రచారాలు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం

వరదల సమయంలో ప్రతిపక్ష పార్టీ లు కూడా వేలెత్తి చూపించకుండా పని చేసిన ఘనుడు చంద్రబాబు

 టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి

పల్లెవెలుగు వెబ్  మంత్రాలయం: రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యం అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చెట్నహల్లి గ్రామంలో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరి కి స్థానిక టిడిపి నాయకులు చాపల నాగేష్, మేకల మల్లేష్, పెద్ద లక్ష్మయ్య ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు  చేసిన 100 హామీలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. అలాగే 100 రోజుల్లో వైసిపి 100 రకాలుగా అబద్ధపు విష ప్రచారాలు చేయడం జరిగిందని తెలిపారు.  వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చిన బుద్ధి రావడంలేదని అన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి అవ్వతాతలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు వంద రోజుల ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మణిమంజరి, స్పెషల్ అధికారి మండల వ్యవసాయ అధికారి  గణేష్, సచివాలయం సిబ్బంది, మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య, మాలపల్లి మాజీ సర్పంచ్ చావిడి వెంకటేష్, ఎస్ యం గోపాల్ రెడ్డి, బిజెపి ఇన్చార్జ్ మాధవరం విష్ణు వర్ధన్ రెడ్డి, నాయకులు రాఘవేంద్ర కులకర్ణి,జనసేన చిన్న మండల నాయకులు వరదరాజు, డీలర్స్ గోపాల్, మల్లేష్, ఏరేష్, నల్లన్న, పరమేష్, పురుషోత్తం పరుశురాం వెంకటరామ్, హనుమంతు,మాలపల్లి లక్ష్మన్న,  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *