PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం

1 min read

లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు:మాండ్ర

జలకనూరులో జయసూర్య ఇంటింటి ప్రచారం

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని గతంలో చంద్రబాబు అభివృద్ధి చేసిన పనులే నేటికీ గ్రామాల్లో కనబడుతున్నాయని నంద్యాల టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని పైపాలెం, నాగులూటి,పీరు సాహెబ్ పేట గ్రామాల్లో బుధవారం ఉదయం ఆయన రోడ్డు షో ప్రచారం చేపట్టారు.గతంలో ఇసుక సులభంగా వచ్చేదని ఇప్పుడు ఇసుక కొనాలంటే దొరకడమే లేదని మరి ప్రజలు ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలని అన్నారు. నాసిరకం జై బ్రాండ్ మద్యం తాగడం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని ప్రజల మనసు చాలా సున్నితమైనది కాబట్టే ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.మీరు ఆలోచించి మీకు అందుబాటులో ఎవరు ఉంటారో తెలుసుకుని మంచి వ్యక్తి అయిన ఈ ప్రాంత వాసి ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే అభివృద్ధిగా జయ సూర్యకు ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ బైరెడ్డి శబరి కి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని శివానందరెడ్డి అన్నారు.అదేవిధంగా జలకనూరు గ్రామంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య ఇంటింటి ప్రచారం చేపట్టారు. శివానందరెడ్డి కి ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు పట్టణ అకౌన్సిలో జాకీర్,టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి, చెరుకుచెర్ల రఘురామయ్య, రామేశ్వర్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి, సోమ సుందర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి జయరాముడు,సంపంగి రవీంద్రబాబు,రమణారెడ్డి, బాబు సాహెబ్,శ్రీనివాసరెడ్డి, శివ,బూత్ ఇన్చార్జి వెంకటేశ్వర రెడ్డి,రామాంజి,హరి సర్వోత్తమ్ రెడ్డి,సుభాన్,మారుతి నగర్ అయ్యన్న,జలీల్,ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author