PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి అంటే చంద్రబాబు..చంద్రబాబు అంటే అభివృద్ధి

1 min read

కూటమి ప్రభుత్వంలో పంచాయితీలకు నిధులు

పల్లె పండుగలో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే భూమి పూజ

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): రాష్ట్రంలో అభివృద్ధి అంటే చంద్రబాబు..చంద్రబాబు అంటే అభివృద్ధి అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.మంగళవారం ఉదయం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రం మరియు చింతలపల్లి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు.ముందుగా మిడుతూరులో సాగర్ రెడ్డి వీధిలో 50 లక్షల ఉపాధి నిధులతో భూమి పూజ చేశారు తర్వాత స్టేట్ బ్యాంకు దగ్గర టిడీపీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. తర్వాత చింతలపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేశారు.ఎస్సీ కాలనీలో 50 లక్షల నిధులతో రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పంచాయతీకి నిధులు విడుదల చేయడం జరిగిందని మండలానికి రెండు కోట్ల 50 లక్షలు నిధులు మంజూరు పది అభివృద్ధి పనులకు ఉపయోగించడం జరుగుతుందన్నారు. చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారని అన్నారు.జగన్ తన హయాంలో పల్లెలను సర్వనాశనం చేశారని అభివృద్ధి లేకుండా చేసిన ఘనత జగన్ కే దక్కిందని అన్నారు.చింతలపల్లి మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ నియోజకవర్గ ప్రత్యేక అధికారి సుధారాణి,టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, జనసేన సమన్వయకర్త రవికుమార్,వంగాల శివరామిరెడ్డి, ఎంపీడీవో దశరథ రామయ్య,రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం,ఎస్సై ఓబులేష్,ఈఓఆర్డి సంజన్న,సర్పంచ్ రమణమ్మ,రఘురామయ్య, బిజెపి దామోదర్ రెడ్డి,ఏఈ లు ప్రతాప్ రెడ్డి,విశ్వనాధ్,కాతా విష్ణువర్ధన్ రెడ్డి,హరి సర్వోత్తమ్ రెడ్డి,రవీంద్రబాబు, రమణా రెడ్డి,నాగేంద్ర,గోకారి, సర్వోత్తమ్ రెడ్డి,చాకర్ వలి,షబ్బు,నరసింహ గౌడ్, నాగేంద్ర,సుధాకర్,మణి వర్ధన్ రెడ్డి,ఎల్లారెడ్డి పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *