PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశ అభివృద్ధి బిజెపి ప్రభుత్వం తోనే సాధ్యం 

1 min read

కౌతాళం కి 100 పడకల హాస్పిటల్ ను శాంక్షన్ చేయిస్తా

బిజెపి మండల విస్తృతస్థాయి సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలి

హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల కేంద్రం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు శనివారం రోజున పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తం మీద బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా  మంత్రాలయం నియోజకవర్గంలో ఎక్కువ శాతం సభ్యత్వ నమోదు చెయ్యాలని లక్ష్యంగా మరియు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దేశం అభివృద్ధి కోసం బిజెపి సభ్యత్వం తీసుకోవాలని అన్నారు.ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశం మొత్తం మీద  20 కోట్ల మందితో సభ్యత్వాలు చేయాలని అదేవిధంగా బిజెపి ప్రభుత్వం 11 సంవత్సరాలు దేశ అభివృద్ధి కోసం పనిచేసింది రాబోయే రోజుల్లో కూడా దేశ అభివృద్ధి కోసం ప్రజల కోసం ఇంకా ఎన్నో సేవలు అందించేందుకు భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుందని అన్నారు.మరియు ముఖ్యంగా కౌతాళం మండలానికి 100 పడకల హాస్పిటల్ ను శాంక్షన్ చేయిస్తానని ఇక్కడ ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఎన్నో  ఇబ్బందులు పడుతున్నారని  ఈ సమస్యలన్నిటిని బిజెపి ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ దృష్టికి తీసుకొని వెళ్లి ఆయనను కౌతాళం మండలానికి తీసుకొని వచ్చి వంద పడకల హాస్పిటల్ ను శాంక్షన్ చేయిస్తానని తెలిపారు.ఇంకా ఏమైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకొని రావాలని ఆ సమస్యలన్నిటిని పరిష్కరించే దిశగా మేము పనిచేస్తామని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నబిసాబ్ బిజెపి మండల ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి,బిజెపి మండల కార్యదర్శి రామచంద్ర  బిజెపి నాయకులు ఎల్లయ్య మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *