PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నందికొట్కూరు  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  అభ్యర్థి తొగురు ఆర్థర్ అన్నారు.  నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో 3వ వార్డు, 24వ వార్డు నందు శనివారం  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోగురు ఆర్థర్    ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తం గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి గా మరోసారి నన్ను ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు. ఆలాగే  నంద్యాల పార్లమెంటు అభ్యర్థిగా  నరసింహ యాదవ్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఉండవల్లి ధర్మారెడ్డి, షరీఫ్, ఇండియా కూటమి నాయకులు  నాగేశ్వరరావు , పకీర్ సాబ్ , మజీద్ మియా, జయమణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహబూబ్ బాషా, జూపాడు బంగ్లా షాజహాన్, తమ్మడపల్లె ఫ్రాన్సిస్ ,ఈనాయతుల్లా ,సీతారాముడు , బూషీ గౌడ్ , చిట్టి రెడ్డి , ఏసేపు , భాస్కర్ , సుధాకర్ ,  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author