PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెండు ఓట్లు ఫ్యాన్ వైపు వెళ్తేనే అభివృద్ధి

1 min read

అభివృద్ధి వైకాపాతోనే సాధ్యం

ఒకే రోజు మండలాన్ని చుట్టేసిన ఎంపీ పోచా, మల్లికార్జున రెడ్డి

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: వచ్చేనెల 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి మరియు ఎంపీ అభ్యర్థికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని నంద్యాల పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి, బైరెడ్డి మల్లికార్జున రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి మరియు వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి మరియు మల్లికార్జున రెడ్డి శనివారం ఉదయం 7 గంటల నుండి జలకనూరు,చెరుకుచెర్ల, అలగనూరు,తలముడిపి, తిమ్మాపురం,మాసపేట, కడుమూరు,49 బన్నూరు, గుడిపాడు,దేవనూరు,చౌటుకూరు తదితర గ్రామాల్లో ప్రజలు మరియు మహిళలతో రెండు ఓట్లను వైకాపా కు ఓటు వేయాలని వారు ఓటర్లను అభ్యర్థించారు.అభివృద్ధి అంటే వైకాపాతోనే సాధ్యమని అన్నారు.ఎండను లెక్కచేయకుండా ఒకే రోజు ప్రచారంలో మండలాన్ని మొత్తం చుట్టేశారు.అదే విధంగా అన్ని గ్రామాల్లో ముఖ్య నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లారు. చౌటుకూరులో మేళ తాళాల నడుమ నాయకులు ఘన స్వాగతం పలికారు.చౌటుకూరులో మిడుతూరు ఓర్వకల్లు రహదారి బస్టాండు లో ఉన్న రహదారి అధ్వానంగా ఉందని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవడంలేదని మా కాలనీ ఇళ్లల్లోకి దుమ్ము విపరీతంగా రావడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురౌతున్నామని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని కాలనీవాసులు అడిగారు.ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి,  వైసీపీ నాయకులు చిన్న మల్లారెడ్డి,నాగ తులసి రెడ్డి,సర్పంచులు మదార్ సాహెబ్,నాగ స్వామి రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి,సాంబశివుడు, బాలిరెడ్డి,సాదిక్,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author