PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నోట్ బుక్స్ పాఠ్యపుస్తకాలు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు  : మండలం లోని ముండ్లపల్లె ప్రాథమిక పాఠశాల తెలుగు నందు చదువుతున్న విద్యార్థులందరికీ నోట్ బుక్కులు, పాఠ్యపుస్తకాలను మండల విద్యాశాఖ అధికారి గంగిరెడ్డి ఎంఈఓ-2 సునీత చేతుల మీదుగా బుధవారం విద్యార్థులకు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, విద్యార్థులందరూ క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని, అలాగే విద్యార్థులకు ఏవైనా నోట్ బుక్కులు , పాఠ్య పుస్తకాలు , షూస్ ,బ్యాగ్స్ వంటి విద్యా సామాగ్రి ఏవైనా అందకపోతే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు, అదేవిధంగా విద్యార్థులందరికీ మెను తో కూడిన భోజనం అందించాలని , పాఠశాల ఆవరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అక్కడ ప్రధాన ఉపాధ్యాయులకు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి చిన్నపరెడ్డి, నిర్మలా దేవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author