PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రంధి అమరేంద్ర సహకారంతో 30 మందికి గొడుగులు పంపిణీ

1 min read

రెడ్ క్రాస్ చైర్మన్ బి.వి.కృష్ణారెడ్డి అందజేత

అకాల వర్షాల కారణంగా వైద్య సేవలకు వచ్చే పేదలకు సహాయం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులకు, ఆర్ఆర్ పేట లోని రోడ్డుపై వెళ్లే పాదచారులకు జిల్లా  రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి గొడుగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయని, గొడుగులు లేకుండా ఆసుపత్రికి వచ్చే రోగులకు, రోడ్డుపై వెళ్లే పాదచారులకు గొడుగులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో, దాత ఏలూరు వైభవ్ జువెలరీస్ అధినేత గ్రంధి అమరేంద్ర సహకారంతో 30 మందికి గొడుగులు పంపిణీ చేశామని కృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి కేబి సీతారాం, డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కె వరప్రసాదరావు, డాక్టర్ జి.స్పందన, ఏ.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

About Author