PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోవులను కళేబరాలకు విక్రయిస్తారా..!

1 min read

దుర్గారపు పనులు చేసే ఎమ్మెల్యే అనుచరులను వదలను…

  • తాటాకు చప్పళ్లకు బెదరను…
  • భూ దందాలు,కబ్జాలు మానుకో…
  • ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి అభ్యర్థి డా. పార్థసారధి
  • కుప్పగల్​లో కూటమినేతల ప్రచారానికి విశేష స్పందన…

 ఆదోని, పల్లెవెలుగు:మండలంలోని కుప్పగల్​ గ్రామంలో వెలిసిన తిమ్మప్ప స్వామి దేవాలయానికి చెందిన 40 గోవులను… సొమ్ము చేసుకున్న ఎమ్మెల్యే అనుచరుడు, పూజారి హరిప్రసాద్​ రెడ్డిని ఊరికేవదలనని…శిక్ష తప్పదని హెచ్చరించారు ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. మంగళవారం నియోజకవర్గంలోని కుప్పగల్​ గ్రామంలో కూటమి( బీజేపీ–జనసేన– టీడీపీ) నేతలు విస్తృత ప్రచారం చేశారు.  ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుతూ భూకబ్జాలు…దందాలు చేసిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి …తన అనుచరులతో దుర్మార్గపు పనులు చేయించాడని ధ్వజమెత్తారు. తిమ్మప్ప స్వామి దేవాలయంకు సంబంధించిన 40 గోవులను విక్రయించిన సదరు పూజారిని…. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే చెట్టుకు కట్టేసి శిక్షిస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్నారు. కుప్పగల్​ గ్రామస్తుల కోరిక మేరకు తిమ్మప్ప స్వామి దేవాలయంలో కళ్యాన మండపం కట్టిస్తానని హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే… అందుబాటులో ఉండి సేవ చేస్తానని, భూ కబ్జాలు, దందాలు, మద్యం, ఇసుక ను బ్లాక్ మార్కెట్​ కు తరలించే దుర్మార్గపు పనులు చేయనని  ఈ సందర్భంగా అభ్యర్థి డా. పార్థసారధి ప్రజలకు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి… వేయించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author