PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి కావాలా… అరాచక పాలన కావాలా..

1 min read

జగన్ పాలన నుంచి ఏపీకి వీముక్తి  కూటమి లక్ష్యం..

టీడీపీ విజయమే లక్ష్యంగా..

ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ.

టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నా ప్రజలు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : రాష్ట్ర అభివృద్ధి కావాలా లేక వైసీపీ రాక్షస పాలన కావాలా..జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే కూటమి లక్ష్యమని నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి,  నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య అన్నారు. తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా తెలుగుదేశం నాయకులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గురువారం  ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో భాగంగా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి కొత్తపల్లి మండలం ఎర్రమఠం, ముసలమడుగు, గుమ్మడాపురం, సింగరాజు పల్లి    , మిడుతూరు మండలం రోళ్లపాడు, తలముడిపి ,నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య నందికొట్కూరు మండలం బొల్లావరం , దామగట్ల ,పగిడ్యాల మండలం ఘణపురం, ప్రాత కోట  గ్రామాలలో రోడ్డుషో కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సూపర్ సిక్స్  పథకాలను వివరిస్తూ ఎన్నికల శంఖారావం పూరించారు.సందర్భంగా  మాండ్ర శివానంద రెడ్డి  ,గిత్త జయసూర్య లు   మాట్లాడుతూ వైసీపీకి మరోసారి ఓటు వేస్తె ప్రజల ఆస్తులు గాల్లో దీపంగా మారడం ఖాయమని, వైసిపి హయంలో వ్యవసాయం చేసే రైతులు నష్టాల్లో ఉంటే, గంజాయి పండించే వైకాపా నాయకులు లాభాల్లో ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యధేచ్చగా గంజాయి విక్రయాలతో యువత మత్తుకు బానిసలవుతున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డ్రగ్స్, గంజాయి మాఫియాను అరికడతామన్నారు. రాష్ట్ర ప్రజల చేతిలో జగన్ కు పరాభవం తప్పదని మే 13 జరిగే ఎన్నికల్లో నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నందికొట్కూరు టీడీపీ ఎంఎల్ఏ అభ్యర్థి గిత్త జయసూర్య కు సైకిల్ గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

About Author