PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జిజిహెచ్​ కాన్ఫరెన్స్ హాల్ లో డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి   మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంత్రి కాన్ఫరెన్స్ హాల్ లో డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ పురస్కరించుకొని కేక్ కట్ చేసి పలువురు వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని డాక్టర్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా శుభ పరిణామం అని అన్నారు. అలాగే ఆసుపత్రి సిబ్బంది సమయపాలనలో ఉండాలని మరియు ఆసుపత్రి సిబ్బంది 90% సిబ్బంది పనితీరు మెరుగుపడిందని మరియు ఆసుపత్రి సిబ్బంది 10% ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని వారికి  తెలియజేశారు. ప్రజలు ఇచ్చే టాక్స్ ద్వారా మనకు జీతాలు అందుతాయి వారికి సరైన న్యాయం చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఆసుపత్రిలో లేడీస్ స్టాఫ్ కి  డైనింగ్ రూం మరియు వాష్ రూమ్ కావాలని వారు అడిగారు. అనంతరం దానికి సానుకూలంగా స్పందిస్తూ త్వరలో అందుబాటులో తీసుకొస్తామని వారికి హామీ ఇచ్చారు.ఆసుపత్రిలో  ప్రతి ఒక్కరు అంకితభావంతో పని చేయాలని సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సిఎస్ఆర్ఎంఓ, డా.వెంకటేశ్వరరావు,  ARMO, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్, శ్రీ.శ్రీనివాసులు, అకౌంటెంట్, శ్రీ.కుమారస్వామి,  నర్సింగ్ సూపరింటెండెంట్, శ్రీమతి.SP.సావిత్రిబాయి, ఆసుపత్రి సిబ్బంది చిరంజీవి, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, గ తెలిపారు.


        

About Author