PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర‌ మంత్రి టి.జి భ‌ర‌త్ చేతుల‌మీదుగా సీఎంఆర్ఎఫ్‌కు విరాళం

1 min read

దాత‌ల‌ను అభినందించిన మంత్రి టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకురావ‌డం ఎంతో సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు సీ.ఎం.ఆర్.ఎఫ్ కు మంత్రి టి.జి భ‌ర‌త్ చేతుల‌మీదుగా క్రెడాయ్ కర్నూల్ చాప్టర్ తరుపున రూ. 6.50 లక్షలు విరాళం అందించారు. కర్నూలు నగరంలోని కార్యాలయంలో మంత్రి టి.జి భరత్ ను కలిసి చెక్కును అందజేశారు. ఈ సంద‌ర్భంగా దాత‌ల‌ను మంత్రి టి.జి భ‌ర‌త్ అభినందించారు. విప‌త్కర ప‌రిస్థితుల్లో చిన్నస‌హాయ‌మైనా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని టి.జి భ‌ర‌త్ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు వరద బాధితులను ఆదుకునేందుకు నిద్రాహారాలు పక్కనపెట్టి కష్టపడ్డారని అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో క‌ర్నూల్ క్రెడాయ్ సభ్యులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *