PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీకి మరో అవకాశమివ్వొద్దు..

1 min read

వచ్చేది కూటమి ప్రభుత్వమే…

  • ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు: ఆదోనిలో వైసీపీకి మరో అవకాశమివ్వొద్దని,  రాష్ట్రంలో వచ్చేది కూటమి ప్రభుత్వమేనన్నారు ఆదోని కూటమి (బీజేపీ–జనసేన–టీడీపీ) అభ్యర్థి డా. పార్థసారధి. మీరు ఓటేస్తేనే..  ఎమ్మెల్యేగా గెలిచిన సాయిప్రసాద్​ రెడ్డి …మీ భూమిని కబ్జా చేస్తూ….బెదిరింపులకు పాల్పడుతున్నాడని, అటువంటి వ్యక్తికి మరో అవకాశం ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. శుక్రవారం  ఉదయం పట్టణంలోని ఇందిరానగర్​, ఎల్​ఐసీ కాలనీ, దివాకర్​ రెడ్డి కాలనీలో కూటమి నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి.. దేశ ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్న ఆదోనిలో …వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నికల సమయంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ ఓట్లు రాబట్టుకునేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. తనను గెలిపిస్తే… కేంద్ర , రాష్ట్ర సంక్షేమ పథకాలు కులమతాలకతీతంగా అమలు చేస్తానని అభ్యర్థి డా. పార్థసారధి వెల్లడించారు.  అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్​ జైన్​, జనసేన ఇన్​ఛార్జ్​ మల్లప్ప మాట్లాడారు.  కార్యక్రమంలో బీజేపీ–జనసేన– టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

About Author