PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డీఎస్ఓ గా బాధ్యతలు స్వీకరించిన రాజా రఘువీర్​

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు కలెక్టరేట్​ కార్యాలయంలో పని చేస్తున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు బదిలీ కావడంతో ..వారి స్థానంలో శుక్రవారం కొందరు బాధ్యతలు స్వీకరించారు.  సివిల్​ సప్లై జిల్లా అధికారిగా డిప్యూటీ డైరెక్టర్​ రాజా రఘువీర్​ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలో పని చేస్తున్న రాజా రఘువీర్​ ఇక్కడికి  డిప్యూటేషన్​ పై రాగా.. ఇక్కడ పని చేస్తున్న ప్రసాద్​ రాజమండ్రికి బదిలీపై వెళ్లారు. అంతకు ముందు కలెక్టర్​ రంజిత్​ బాషను , జాయింట్​ కలెక్టర్​  బి. నవ్య ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు. ఈ సందర్భంగా రాజారఘువీర్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇన్​చార్జ్​ డీఎస్​ డీఓగా పని చేశానని, జిల్లాలో పౌర సరఫరాల శాఖ అధికారుల సమన్వయంతో విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూస్తానన్నారు.

డీఆర్​ డీఏ ఇన్​చార్జ్​ పీడీగా నాగశివలీల

డీఆర్​ డీఏ ఇన్​చార్జ్​ పీడీగా నాగశివలీల శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న పీడీ సలీంబాష  శుక్రవారం మధ్యాహ్నం రిలీవ్​ అయ్యారు. ప్రస్తుతం మెప్మా పీడీగా విధులు నిర్వర్తిస్తున్న నాగశివలీల… శుక్రవారం సాయంత్రం డీఆర్​ డీఏ ఇన్​చార్జ్​ పీడీగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా డీఆర్​ డీఏ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా తన వంతు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఆర్​ డీఏ ఇన్​చార్జ్​ పీడీ నాగ శివలీల ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *