PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన డోన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: రానున్న ఎన్నికలలో డోన్ సబ్ డివిజన్ లోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక నిఘాతోపాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా చర్యలు చేపడుతున్నామని డోన్ డీఎస్‌పీ శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం ప్యాపిలి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లోని వార్షిక రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే పరిశీలించామన్నారు.  గ్రామాలల్లో శాంతిభద్రతల తో పాటు దొంగతనాల నియంత్రణ కోసం రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నమన్నారు. అలాగే గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు రాత్రి వేళలో కనిపించిన ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్యాపిలి సీఐ సుధాకర్ రెడ్డి,ప్యాపిలి ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి, జలదుర్గం యస్ఐ విజయ్ కుమార్, యన్.రాచర్ల  యస్ఐ చంద్ర మోహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author