PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులను అభినందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లాలోని యస్.ఆర్. విద్యా సంస్థలయందు చదువుకున్నటువంటి 2 1.5. , H.T. No. 240310439090 – JEE MAINS RANK 148, 2.H.T. No. 246029007-JEE ADVANCED RANK 127 ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్ లో ర్యాంక్ లు సాధించినటువంటి విద్యార్థులను అమరావతి లో విద్యాశాఖ మంత్రివర్యులు  నారా లోకేష్ చే అభినందనలు మరియు ల్యాప్టాప్లు బహుమతులుగా స్వీకరించడం జరిగినది. ఈ సందర్భంగా లోకేష్మాట్లాడుతూ విద్యాభ్యాసం పూర్తయిన తరువాత వారికి మన రాష్ట్రంలోనే ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగాలను సృష్టిస్తామని హామి ఇవ్వడం జరిగినది. మన రాష్ట్రంలోని గ్రామీణ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా యస్.ఆర్ విద్యా సంస్థల యాజమాన్యాన్ని మరియు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఇదే విధంగా యస్.ఆర్. విద్యా సంస్థలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించి వారికి మంచి భవిష్యత్తును అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. యస్. ఆర్. విద్యార్థులను విద్యాశాఖ మంత్రవర్యులు అభినందించడం పట్ల కర్నూల్ యస్.ఆర్. జోనల్ ఇంచార్జ్ శ్రీ రఘువీర్  హర్షం వ్యక్తం చేశారు.

About Author