PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓఆర్ఆర్ వెంట పూడిక‌తీత ప్రయ‌త్నాలు భేష్‌

1 min read

హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ స‌ర్ఫరాజ్ అహ్మద్

 భారీవ‌ర్షాల నేప‌థ్యంలో అప్రమ‌త్తంగా ఉండాలి

పల్లెవెలుగు వెబ్ హైద‌రాబాద్ : భారీవ‌ర్షాల నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా రెడ్ ఎల‌ర్ట్ జారీ చేసినందున ఔట‌ర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంట ప‌లు ప్రాంతాల‌ను హెచ్ఎండీఏ మెట్రోపాలిట‌న్ క‌మిష‌న‌ర్ స‌ర్ఫరాజ్ అహ్మద్ ప‌రీక్షించారు. ముఖ్యంగా గ‌త సంవ‌త్సరం నీరు భారీగా నిలిచిపోయిన కొల్లూరు జంక్షన్, మ‌ల్లంపేట‌, షామీర్‌పేట ప్రాంతాల్లో ఆయ‌న‌తోపాటు హెచ్‌జీసీఎల్ సీజీఎం ర‌వీంద్ర‌, ఐఆర్‌బీ ఇంజినీర్లు, ఇత‌ర అధికారులు క‌లిసి ప‌ర్యటించారు. డ్రెయిన్ల ప్రస్తుత ప‌రిస్థితిని క‌మిష‌న‌ర్ క్షుణ్ణంగా ప‌రిశీలించి, పూడిక‌తీత ప‌నుల‌ను స‌మ‌ర్థంగా పూర్తి చేశార‌ని, ఇంత భారీ వ‌ర్షాలు కురిసినా ఎక్కడా నీరు నిల‌బ‌డ‌లేద‌ని ప్రశంసించారు. నిర్వహ‌ణ సంస్థ అయిన మెస‌ర్స్ ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థకు క‌మిష‌న‌ర్ స‌ర్ఫరాజ్ అహ్మద్ కొన్ని కీల‌క సూచ‌న‌లు చేశారు. ప్రస్తుతం చేస్తున్నట్లే ఈ ప‌నుల‌న్నీ కొన‌సాగించాల‌ని తెలిపారు. ఎప్పటికప్పుడు నిర్వహ‌ణ పనులు చేయాల్సిన ప్రాధాన్యం గురించి స్పష్టం చేస్తూ, భారీ వ‌ర్షాల స‌మ‌యంలో అప్రమ‌త్తంగా ఉండాల‌ని కోరారు. ఒక‌వేళ నీళ్లు చేరినా తోడేసేందుకు పంపులు, ఎక్స్‌క‌వేట‌ర్లు, ఇత‌ర యంత్రాల‌ను సిద్ధంగా ఉంచుకుని, అత్యవ‌స‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవాల‌ని సూచించారు. ఓఆర్ఆర్ మీద వెళ్లే వాహ‌న‌దారులంద‌రికీ సాయం చేసేందుకు పాట్రోలింగ్ బృందాల‌ను మ‌రింత‌గా పెంచాల‌ని, అలాగే వేరియ‌బుల్ మెసేజ్ సైన్ (వీఎంఎస్) బోర్డుల మీద రెయిన్ ఎల‌ర్ట్ మెసేజిలు చూపిస్తూ వాహ‌న‌దారుల‌ను అప్రమ‌త్తం చేయాల‌ని క‌మిష‌న‌ర్ సూచించారు. పూడిక‌తీత ప‌నుల‌ను స‌రైన స‌మ‌యానికి, స‌మ‌ర్థంగా చేసినందుకు ఐఆర్‌బీ సంస్థను ఆయ‌న అభినందించారు. దీనివ‌ల్ల వ‌ర్షపునీరు ఎప్పటిక‌ప్పుడు వెళ్లిపోతూ, ట్రాఫిక్ అంత‌రాయం లేకుండా ఉంద‌ని చెప్పారు. భారీ వ‌ర్షాల స‌మ‌యంలో కూడా హైద‌రాబాద్ వాసుల ప్రధాన ర‌వాణా మార్గమైన ఓఆర్ఆర్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహ‌నాలు వెళ్తుండ‌టం వెన‌క నిర్వహ‌ణ బృందాల కృషి ఎంతో ఉంద‌ని శ్లాఘించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *