PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నీతి నిజాయితీగా ఉండేవారినే ఎమ్మెల్యేగా ఎన్నుకోండి … ఆర్థర్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నీతి నిజాయితీగా ఉండేవారినే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోగూరు ఆర్థర్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని శనివారం సాయంత్రం కడు మూరు,పీరు సాహెబ్ పేట, మిడుతూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. గత ఐదు సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలకు ఎన్నో సేవలు చేశానని ప్రతి గడప గడపకు వెళ్లి మీతో మాట్లాడాను.మీకంతా తెలుసు నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.అయినా సహించాను బాధ పడలేదు గడప గడప కార్యక్రమంలోనూ అన్నింటిలోనూ రాష్ట్రంలోనే మొట్ట మొదటి ఎమ్మెల్యేగా ఉన్నాను.కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చిందని త్వరలోనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానని అన్నారు.మీరు ఎన్నుకునే ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల పాటు మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది మీరు ఫోన్ చేస్తే ఆ ఎమ్మెల్యే మీ ఫోన్ ఎత్తి మీ సమస్యను తెలుసుకునే వారినే మీరు ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  రైతులకు రుణమాఫీ రెండు లక్షల వరకు ఉంటుందని రైతులకు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు కౌన్సిలర్ ధర్మారెడ్డి,సుంకేసుల వెంకట్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రియాజ్ రెహమాన్,అయూబ్, అబ్దుల్ రహమాన్,సమీవుల్లా, దామగట్ల అనిల్,ఇనాయతుల్ల, జాన్,నడిపి నాగన్న, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.

About Author