PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పీరుసాహెబ్ పేట,నాగలూటిలో తెదేపా ఎన్నికల ప్రచారం

1 min read

టిడిపి విజయానికి పూలబాట వేయండి:మాండ్ర

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నందికొట్కూరులో టిడిపి విజయానికి పూలబాట వేయాలని నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య,నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం 5:30 నుంచి 9:30 వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అదే విధంగా శనివారం సా.5:30 నుంచి రాత్రి దాకా నాగలూటి లో మాండ్ర శివానందరెడ్డి,పీరు సాహెబ్ పేటలో నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య,శివానందరెడ్డి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్తూ వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని రెండు ఓట్లను ఎమ్మెల్యే అభ్యర్థికి మరియు ఎంపీ అభ్యర్థికి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అదేవిధంగా మూడు సిలిండర్లు ఉచితం 18 సంవత్సరాలు దాటిన ఆడపడుచులకు ప్రతినెలా 1500 రూపాయలు తదితర పథకాల గురించి ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి,వంగాల శివరామిరెడ్డి,కాతా విష్ణువర్ధన్ రెడ్డి మరియు గ్రామ టిడిపి నాయకులు సోమ సుందర్ రెడ్డి,రామేశ్వర్ రెడ్డి,డి జయరాముడు,భద్రారెడ్డి, మహేశ్వర్ రెడ్డి,పుల్లారెడ్డి మరియు నాగలూటి టిడిపి నాయకులు సంపంగి రవీంద్రబాబు,రమణారెడ్డి, రామలింగేశ్వర రెడ్డి,కృష్ణ రామకృష్ణ,బాబుసా తదితరులు పాల్గొన్నారు.

About Author