PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నగరపాల సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎన్నికల ప్రచారం

1 min read

ఏలూరు వైసిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ కరపత్రాలు పంపిణీ

పెదబాబుతో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మే13వ తేదీన జరుగు అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు గా పోటీ చేయుచున్న  ఆళ్ల నాని ని, పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ని ఫ్యాను గుర్తుపై ఓటేసి వారికి ఘన విజయం సాధించాలన్నారు.  స్థానిక 50 వ డివిజన్ గవరపేట లో నగరపాలక కో- ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఆధ్వర్యంలో గురువారం స్థానిక నాయకులు, కార్యకర్తలతో గడప-గడపకు తిరిగి ఈ ఐదేళ్ల పాలనలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి  పథకాలను. నవరత్నాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని, వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచెం మహిబాబు,కొల్లిపాక సురేష్, ఎమ్మెల్సీ కాలనీ వైయస్సార్ పార్టీ డివిజన్ ముఖ్యనాయకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనారు.

About Author