PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం

1 min read

ఉపాధి కూలీలను కలిసి కూటమికి ఓటేసి గెలిపించాలని అభ్యర్థన

వైసిపి పార్టీని ఇంటికి సాగనంపండి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పెదవేగి మండలం రామసింగ వరం లో శుక్రవారం ఉదయం చింత మనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చింతమ నేనికి మహిళలు అడుగడుగునా పూలాభిషేకాలతో హారతులతో స్వాగతం పలికారు. రామసింగవరం గ్రామ పంచాయతీ దుర్గమ్మ కాలనీలో కూడా ప్రజలు చింతమనేనికి ఘన స్వాగతం పలికారు. మరో ఆరు నెలల్లో ఎన్ డి ఏ ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని దుర్గమ్మ కాలనిలో అర్హత ఉండి కూడా ఇళ్లస్థలం రానివారికి తాను ఎం ఎల్ ఏ గా గెలుపొందాక ఒక్కొక్కరికి 3 సెంట్లు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తానని చింతమనేని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. మే 13 వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని. అలాగే తనతోపాటు ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని చింతమనేని ప్రభాకర్ కోరారు.ఈ కార్యక్రమం లో పెదవేగి మండల టి డి పి అధ్యక్షులు బొప్పాన సుధాకర్.తాతా సత్యనారాయణ  గ్రామ సర్పంచ్ అడపా శ్రీనివాసరావు.ఎం పి టి సి గుర్రం మాధవరావు.టి డి పి నాయకుడు అడపా రాఘావ.తదితరులు పాల్గొన్నారు. గ్రామ సమీపంలో ఉదయాన్నే ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు చేరుకున్న చింతమనేని ప్రభాకర్. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తు చేశారు. వైసిపి పార్టీని రాబోయే ఎన్నికల్లో ఇంటికి సాగనపాలని పిలుపునిచ్చారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి మరికొద్ది రోజుల్లో అధికారంలోకి రానున్నదని అన్నారు. ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తనను, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ ను గెలిపించాలని చింతమనేని ఓటర్లను అభ్యర్థించారు.

About Author