PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థులతో ఎన్నికల ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు మండలంలోని గార్గేయపురం, పూడూరు, పడిదేంపాడు గ్రామాల్లో కోడుమూరు టీడీపీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి , కోడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి లతో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజ…నాయకులకు భారీ స్వాగతం  పలికిన టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు…ప్రచారాల్లో భాగంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న ఎం.పీ, ఎం.ఎల్.ఏ అభ్యర్థులు…తనను ఎం.పీగా గెలిపిస్తే కర్నూలు జిల్లాను మరో కోస్తా ప్రాంతంగా మారుస్తా..బస్తిపాటి నాగరాజుతనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎం.పీ గా గెలిపిస్తే కర్నూలు జిల్లాని మరో కోస్తా ప్రాంతంగా మారుస్తానని కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు హామీ ఇచ్చారు..కర్నూలు మండలం లోని గార్గేయపురం , పూడూరు, పడిదెంపాడు గ్రామాల్లో కోడుమూరు టిడిపి సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థిలతో కలిసి నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ప్రచారాల్లో భాగంగా ఎంపీ, ఎం.ఎల్.ఏ అభ్యర్థులు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఎం.పీ అభ్యర్థి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ని 25 పార్లమెంట్లల్లో అత్యధికంగా వెనుకబడింది కర్నూలు పార్లమెంటేనని, జిల్లాలో సరైన  సాగునీటి వనరుల లేక ప్రతి ఏడాది తీవ్ర కరువు ఛాయలు అలుముకొని, బ్రతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు..చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీటిని ఇచ్చి కరువు, వలసలను నివారిస్తామని స్పష్టం చేశారు..అలాగే మిషన్ రాయలసీమ ద్వారా తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు…ఇక ఐదేళ్ల జగన్ విధ్వంస పాలనలో రాష్ట్రం అంధకారంలో కి వెళ్లిందన్న నాగరాజు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

About Author