PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్  ఎన్నికలు ప్రచారం..

1 min read

పొగాకు రైతు సమస్యలు తెలుసుకున్నారు

ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి కి, నాకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించండి

జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల ప్రచారంలో భాగంగా బుట్టాయిగూడెం మండలంలోని రెడ్డి గణపవరం జైనవారిగూడెం వాడపల్లి వాడపల్లి కాలనీ గ్రామాల్లో శాసనసభ్యులు తెల్లం బాలరాజు, వైఎస్ఆర్సిపి పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి  తెల్లం రాజ్యలక్ష్మి , వైఎస్ఆర్సిపి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా కారుమూరు సునీల్ కుమార్  ప్రచారం లో మాట్లాడుతూ తెల్లం రాజ్యలక్ష్మి కి , నాకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోనే గిరిజన ఆదివాసీలు  రైతులు యువత కోసం వారి అభివృద్ధి కోసం కృషి చేస్తానని పోలవరం నియోజకవర్గం లోని యువత  స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, జాబ్ మేళాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఏజెన్సీ ప్రాంత సమస్యల గురించి పార్లమెంటులో చర్చించి ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి పోలవరం నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. మరోసారి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

About Author