PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలకు 8న ముహూర్తం ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్ కమిటీ ఎన్నికల కోసం  టిడిపి ప్రభుత్వం సిద్ధమైంది . ఈనెల 8వ తేదీ మండలంలోని అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎన్నికలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు డి ఈ ఓ .ఆదేశాలు జారీ చేశారు ఎంఈఓ ఆధ్వర్యంలో సాఫీగా ఈ ఎన్నికలు జరిగేందుకు పోలీసు బందోబస్తు లో జరగనున్నాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలకు జరిగే సమయంలో పాఠశాల పరిసరాలలో  ఎవరు ఉండకుండా 144 సెక్షన్ అమలు చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు  టిడిపి ప్రభుత్వం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గ్రామస్థాయి టిడిపి నాయకుల సత్తా తెలిసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

About Author