PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గడివేముల మండలంలో 42 పోలింగ్ బూత్లలో సోమవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.మండలంలో34411  మొత్తం ఓట్లు ఉన్నాయి. స్త్రీలు17512 , పురుషులు16897,ట్రాన్స్ జెండర్ 2  ఉన్నారు. మండలంలో ప్రధానంగా వైయస్సార్సీపి, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులకు పోటాపోటీగా ఓటర్లు ఓటు వేసినట్లు సమాచారం. అసలు అంచనాలకు అందకుండా ఈ ఎన్నికల్లో ఓటరు తమ తీర్పు ఇవ్వబోతున్నట్లు పేర్కొంటున్నారు. మండలంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతం ముగిసింది. ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఐఏఎస్ పంకజ్‌కుమార్‌, లిజనింగ్ ఆఫీసర్ ఆంజనేయులు, విజయ్ కుమార్ లు మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టిన భద్రతా చర్యలను గడివేముల ఎస్సై బీటి వెంకటసుబ్బయ్య పర్యవేక్షించారు.

About Author