PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి ఓటరు.. ఓటు హక్కును వినియోగించుకోవాలి

1 min read

హై కోర్టు సీనియర్​ న్యాయవాది సేపూరి విజయ మోహన్​

కర్నూలు, పల్లెవెలుగు: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలని సూచించారు హై కోర్టు సీనియర్​ న్యాయవాది సేపూరి విజయ మోహన్​. శుక్రవారం కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్నందుకు భారత రాజ్యాంగం పౌరుల కల్పించిన ఓటు హక్కును  ఓటు హక్కు కలిగిన ఓటర్లందరూ ఓటు ను వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరారు. అలాగే ఎన్నికల కమిషన్ కు,  జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎస్పీలకు, రెవిన్యూ డివిజన్ అధికారులకు, సర్కిల్ ఇన్స్పెక్టర్ , పోలీస్ సిబ్బందికి  ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

About Author