PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పది పరీక్షల్లో సత్తా చాటిన దివ్యాంగ విద్యార్థులు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో దివ్యాంగ విద్యార్థులు తమ సత్తా చాటారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో పదవ తరగతి పరీక్షలకు నలుగురు దివ్యాంగ విద్యార్థులు హాజరుకాగా..నలుగురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల మండల విద్యాధికారి శ్రీనాథ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనాథ్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో  ముగ్గురు విద్యార్థులు మానసిక వికలాంగులు..ఒకరు వినికిడి సమస్య కలిగిన విద్యార్థి హాజరుకాగా  నిబంధనల మేరకు ముగ్గురు మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులకు స్క్రైబ్ ను ఏర్పాటు చేసి పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఉత్తీర్ణత సాధించిన దివ్యాంగ చిన్నారులను స్థానిక ఎమ్మార్సీ భవనంలో మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో సహిత విద్య ఉపాధ్యాయులు రమణ,షహనాజ్,మియా భాష, రమాదేవి దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author