PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్కంఠ గా సాగిన వేలం పాటలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: మండలంలోని బుక్కాపురం గ్రామానికి చెందిన ఆలయ భూముల వేలాలు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈవో స్వర్ణముఖి ఆధ్వర్యంలో వేలాలు నిర్వహించగా 4,46 వేల రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది నాలుగు లక్షల 36 వేల రూపాయలు ఆలయం వచ్చిందన్నారు. 29 ఎకరాలకు వేలంపాటలు నిర్వహించగా 15 ఎకరాలు మాత్రమే వేలాల ద్వారా రైతులు దక్కించుకున్నట్లు తెలిపారు. దాదాపు మిగతా పది ఎకరాలు సరియైన పాటదారులు ముందుకు రాకపోవడంతో వాయిదా వేశామన్నారు. వీటికి సంబంధించి త్వరలోవేలాలునిర్వహిస్తామన్నారు. వేలాల సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బందోబస్తును  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగేంద్ర ప్రసాద్ తో పాటు సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

About Author