PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం                   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  ఇండియా కూటమి బలపరుస్తున్న పత్తికొండ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి పి రామచంద్రయ్య, కర్నూలు ఎంపీ అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్ గెలుపు కోసం గురువారం పత్తికొండ పట్టణంలో సిపిఐ విస్తృత ప్రచారం చేపట్టింది. ఇండియా కూటమి బలపరుస్తున్న అభ్యర్థులు పత్తికొండ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి పి రామచంద్రయ్య గుర్తు కంకి, కొడవలి, పార్లమెంట్ అభ్యర్థి రాంపుల్లయ్య కష్టం గుర్తుపై తమ పవిత్రమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని సిపిఐ శ్రేణులు ఓటర్లను అభ్యర్థించారు. పత్తికొండ పట్టణం ముస్లిం వీధి 6,7,వార్డులో ఇండియా కూటమి అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల శేఖర్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎన్ కృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, మాజీ వార్డు మెంబర్ గుండు భాష, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author