PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియా కూటమి అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  ఇండియా కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల విజయం కోసం పత్తికొండ నియోజకవర్గంలోని గ్రామాలలో సిపిఐ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపట్టారు.   కాంగ్రెస్ సిపిఐ సిపిఎం (ఇండియా కూటమి) బలపరుస్తున్న సిపిఐ పత్తికొండ నియోజవర్గ అసెంబ్లీ అభ్యర్థి కామ్రేడ్ పి రామచంద్రయ్య గారి కంకి కొడవలి గుర్తుపై మరియు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్ హస్తం గుర్తుపై ఓటర్లు తమ అమూల్యమైన ఓటు వేసి, వేయించి గెలిపించాలని పత్తికొండ మండలంలోని  మండగిరి, జె అగ్రహారం, జూటూరు గ్రామాలలో సిపిఐ బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే తిమ్మయ్య సిపిఐ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన ఆవశ్యకతను ఓటర్లకు వివరిస్తూ వినూత్న పద్ధతుల్లో ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

About Author