PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంచేంద్రియాల్లో కళ్లు చాలా ప్రధానమైనవి

1 min read

జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు  : పంచేంద్రియాల్లోని అన్ని అవయవాల్లో కళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్ సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ ఆవరణంలో శాంతిరాం కంటి ఆసుపత్రి, కెవి.సుబ్బారెడ్డి కళాశాల, రెడ్ క్రాస్ సొసైటీ, లైన్స్ క్లబ్, మీసాల రామస్వామి ఆధ్వర్యంలో పాత్రికేయులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు మాట్లాడుతూ అన్ని అవయవాల్లో కళ్లు ప్రధాన భూమిక పోషిస్తాయని, పాత్రికేయులు ఖచ్చితమైన సమాచారాన్ని వేగవంతంగా అందజేయడానికి ప్రతి రోజూ కృషి చేయవల్సి ఉంటుందని, అలాంటి తరుణంలో వారు సమాచారాన్ని పంచుకునే చోటే వారికి అవసరమైన కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన కంటి అద్దాలను ఉచితంగా అందజేయడానికి కృషి చేసిన శాంతిరాం కంటి ఆసుపత్రి, సుబ్బారెడ్డి కళాశాల, రెడ్ క్రాస్, లైన్స్ క్లబ్ సభ్యులకు మరియు ప్రత్యేకంగా సీనియర్ పాత్రికేయులు మీసాల రామస్వామి కృషికి ధన్యవాదాలు తెలిపారు.అనంతరం వక్తలు డా.కెవి.సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత మాట్లాడుతూ ప్రజల మేలు కోసం పాటుపడే పాత్రికేయులు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అదే విధంగా డా.శంకర్ శర్మ మాట్లాడుతూ పాత్రికేయుల కోసం తనవంతుగా ఉచితవైద్య శిబిరాలు నిర్వహించి సేవలు అందజేస్తామని తెలిపారు.కార్యక్రమంలో కెవి.సుబ్బారెడ్డి కళాశాల అధినేత కెవి.సుబ్బారెడ్డి, డాక్టర్ శంకర్ శర్మ, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కె.జి.గంగాధర్ రెడ్డి, ఇంఛార్జి డిఐపిఆర్ఓ దివాకర్ రావు, పాత్రికేయులు మీసాల రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author