PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండలంలో అధిక వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎన్డీఏ కూటమి నాయకులు నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద, టిడిపి సీనియర్ నాయకులు పంపాపతి, అన్నారు. సోమవారం ఎన్డీఏ కూటమి నాయకులు హొళగుందలోని పంటపొలాలను మండల వ్యవసాయాధికారి లోక్ దళ్ ఆనంద్, ఏఈఓ విరుపాక్షి, విఏఏలతో కలిసి పర్యవేక్షించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటలు వేసిన వందరోజులకే అనావృష్టి వలన చాలామంది రైతులు నష్టపోయారన్నారు. మొదట్లో అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి వల్ల వంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఈ ఏడాది కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. మండల వ్యవసాయాధికారి నష్టపోయిన పంటలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు వంపి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుసువాన్, ఎర్రి స్వామి, దుర్గాప్ప, డి, వెంకటేష్, ఆంజనేయులు, ముల్లా మోయిన్, జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ ద్వారకనాథ్, మంగలి వెంకటేష్, రైతులు, గ్రామస్తులు తదితరులున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *