PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులు ఈ పంట నమోదు తప్పకుండా చేసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో రైతులు  తప్ప కుండా ఈ పంట నామోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జీరా గణేష్ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని సూగురు, బూదురు గ్రామాల్లో ఈ పంట నమోదు కార్యక్రమాన్ని తనిఖీలు చేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ మీ పరిధిలో గల రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి మీ యొక్క పంటలను ఖచ్చితంగా నామోదు చేసు కొని రాష్ట్ర ప్రభుత్వం  అందించే వివిధ సౌకార్యాలను పొందాలని కోరారు. రైతులకి వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ పంట నామోదు కార్యక్రమం సెప్టెంబర్ 10 తేది వరకు అవకాశం ఉంటుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

About Author