PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పండుగలా పింఛన్ల పంపిణీ: షబానా బిజెపి కన్వీనర్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక ఎన్నికల్లో పింఛన్ల నగదు పెంపు పై ఇచ్చిన హామీని అమలు చేస్తూ లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అందులో భాగంగా పట్టణంలోని పలు కాలనీలలో  బిజెపి కన్వీనర్ మోమిన్ షబానా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ పింఛను మొత్తాన్ని పెంచడంపై లబ్ధిదారుల్లో ఆనందం కనిపిస్తుంది అన్నారు.ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా తెలుగుదేశం పార్టీ కూటమి పనిచేస్తుందని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తుందని స్పష్టం  చేశారు. 

About Author