PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీరామనవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : శ్రీరామనవమి పండుగసందర్భంగా భవిష్య ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సుద్ధుల మహేందర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. స్థానిక  ఎన్ ఆర్ పి రోడ్డులోమిరాజ్ &శాంతి సినిమాస్ సెంటర్లో బుధవారం శ్రీరామనవమి పర్వదినము పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం భవిష్య ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సుదూస్ మహేందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ నవమి సందర్భంగా 1000 మంది భక్తుల కు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ,ఆ శ్రీరామచంద్రుడు దేశ రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని, శ్రీ రామచంద్రుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని, కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వేణు, మధుసూదన్ , భాషా, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author