PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూర్ అభివృద్ధికై.. సీఎం..డిప్యూటీ సీఎం దృష్టికి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ అభివృద్ధికై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు నేతలు.. గత ఆరు రోజులుగా అమరావతిలో అసెంబ్లీ సమావేశాల్లో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఉన్నారు.శుక్రవారం సాయంత్రంతో అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మరియు నియోజకవర్గ అభివృద్ధి కొరకు నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి మాట్లాడి వినతి పత్రాన్ని అందజేశారు.గొల్లపూడి లో  మాజీ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు.శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే కలిసి నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి పవన్ కళ్యాణ్ తో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతుగా తప్పకుండా కృషి చేస్తామని సీఎం..డిప్యూటీ సీఎం చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు.ముఖ్యమంత్రిని మరియు దేవినేని ఉమా మహేశ్వరరావు ను ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి శాలువాలతో సత్కరించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఎమ్మెల్యేను శాలువాతో  సన్మానించారు.

About Author