PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎవరు ఆ ధైర్య పడొద్దు కార్యకర్తలకు అండగా ఉంటాం వైసీపీ మాజీ ఎమ్మెల్యే

1 min read

చెన్నకేశవరెడ్డి బుట్టా రేణుక వెల్లడి

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:   ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్సార్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మిగనూరు మండలం జెడ్పిటిసి, ఎంపీపీ,వైస్ ఎంపీపీ,సర్పంచులు,ఎంపిటిసిలు,నాయకులు,కార్యకర్తల తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, ఎమ్మిగనూరు  నియోజవర్గ ఇన్చార్జి శ్రీమతి బుట్టా రేణుక మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు  మేము అండగా ఉంటాము అని,ఓటమి గెలుపుకు నాంది అని, ఏ కార్యకర్త అధైర్య పడొద్దు అని మన ఓటమికి కారణం టిడిపి ప్రచారం చేసిన అబద్ధపు ప్రచారమని ల్యాండ్ టైటిల్ యాక్ట్ రైతులకు ఎంతో మేలు కలుగుతుందని ఈ ల్యాండ్ టైటిల్ యాక్టర్ ను. ఎన్. డి. ఏ. ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్టర్ అని ఈ యాక్టును టిడిపి ప్రభుత్వమే బాగుందని అసెంబ్లీలో మద్దతు తెలిపి,  ఎలక్షన్ ముందు ఈ యాక్ట్ పై ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలు నమ్మే విధంగా అపోహాలు సృష్టించారని తెలియజేశారు. మన పార్టీకి 40 శాతం ప్రజలు అండగా ఉన్న కానీ 11 సీట్లు రావడంపై  ప్రజలలో అదేదో తెలియని అపహాలు ఉన్నాయిఅని .జగనన్న ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాడు అని  జగనన్న అబద్ధపు హామీలు చెప్పడని చేసేదే చెబుతాడని ఉంటానని తెలియజేశారు, ఏ కార్యకర్తకు సమస్య వచ్చిన  పెద్దాయన మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వైసీపీ పట్టణం ఇన్చార్జి బుట్టా రేణుక కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బుట్ట నీలకంఠ బసిరెడ్డి వైసిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author