PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బొల్లవరంలో..స్టిక్కర్లను అతికించిన ఎంపీడీఓ మాజీ ఎంపీపీ

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన”ఇది మంచి ప్రభుత్వం”అనే కార్యక్రమాన్ని గ్రామాల్లో అధికారులు నాయకులు కలిసి స్టిక్కర్లను అతికిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని 10 బొల్లవరం గ్రామంలో శనివారం మ 12 గంటలకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు ఎంపీడీవో ఎం శోభారాణి, మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి,పంచాయితీ కార్యదర్శి నూరుల్లా మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లను ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందజేస్తూ సంక్షేమ పథకాల గురించి ఎంపీడీవో మరియు మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడీపీ నాయకులు లక్ష్మి నారాయణ రెడ్డి,సుందర్ రెడ్డి,శాలిమియా సిబ్బంది కలాం,రమణారెడ్డి, శివ,రాజేష్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *