PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంగళవారం నాలుగు నామినేషన్లు

1 min read

అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి కి చెందిన కాటం వెంకట రమణ,  జై భారత్ నేషనల్ పార్టీ తరుపున  ఎమ్మెల్యే  అభ్యర్థిగా నందికొట్కూరు మండలం బోల్లవరం గ్రామానికి చెందిన  బోరెల్లి  వెంకట రాముడు ,సోషల్ డేమోక్రసీ  పార్టీ ఆఫ్ ఇండియా  తరుపున   ( ఎస్డీపిఐ ) ఎమ్మెల్యే అభ్యర్థిగా  వెలుగోడు  మండలం రేగడ గూడూరు కు చెందిన శాబోలు  లింకన్ రాజు, భారత్ చైతన్య యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా కొత్తపల్లి మండలం లింగాపురం కు చెందిన  చిమ్మే వెంకట రమణ లు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల తో కలిసి అట్ట హాసంగా  ర్యాలీగా బయల్దేరి నందికొట్కూరు తహశీల్దార్  కార్యాలయంలో నందికొట్కూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మిరియాల దాసుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మే 13న జరగనున్న ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author