PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచిత కంటి శస్త్ర చికిత్సల శిబిరం ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయ సమీపంలో గల డాక్టర్ సత్యనారాయణ కాంప్లెక్స్ నందు సోమవారం డాక్టర్ జి వి ఎస్ సత్యనారాయణ శర్మ, శంకరా నేత్రాలయ కంటి వైద్యశాల చెన్నై వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుమూల  ప్రాంతమైన ఆత్మకూరులో అత్యధిక టెక్నాలజీతో కూడిన కంటి శస్త్ర చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇక్కడ ప్రజలు ఈ కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా కంటి వైద్య శిబిరానికి తొలిరోజే ప్రజల నుంచి అపూర్వకమైన స్పందన  రావడం సంతోషకరమని తెలిపారు. జూన్ 25 నుంచి జూలై మూడో తేదీ వరకు జరిగే ఈ శిబిరాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సొంత ఊరి ప్రజల పట్ల డాక్టర్ సత్యనారాయణ కుటుంబం ఇంతలా చొరవ తీసుకొని భారీ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.

About Author