PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచిత ఆర్థోపెడిక్స్​ వైద్యశిబిరం

1 min read

పేద రోగులకు సేవ చేయడమే లక్ష్యం

  •  ఆర్థోపెడిక్​ వైద్య నిపుణులు డా.ఎస్​. రవితేజ రెడ్డి

కర్నూలు, పల్లెవెలుగు: సమాజానికి  కొంతైనా వైద్య సేవ చేయాలన్న తలంపుతో  ప్రతి శనివారం ఉచిత కన్సల్టేషన్​ ఆర్థోపెడిక్​ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు  ఎముకలు, నరముల, వెన్నముక మరియు కీళ్ల మార్పిడి శస్ర్తచికిత్స నిపుణులు డా. రవితేజ రెడ్డి తెలిపారు.  స్థానిక ఎన్​ఆర్ పేటలోని డా.ఎస్​. రవితేజ రెడ్డి హాస్పిటల్​లో శనివారం కొందరు ఉచిత ఆర్థోపెడిక్​ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 45 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే ఎముకలు, నరములు, వెన్నుముక, కీళ్ల మార్పిడి కి ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా వైద్య పరీక్ష చేశారు. వైద్య పరీక్షల అనంతరం రోగులకు ఉచిత సలహాలు, సూచనలు ఇచ్చారు.  ఈ సందర్భంగా ఆర్థోపెడిక్​ వైద్య నిపుణులు డా. రవితేజ రెడ్డి మాట్లాడుతూ మనిషి శరీరంలో ఎముకలు, కీళ్ల పాత్ర కీలకమన్నారు. అందుకు వైద్య చికిత్సలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నదన్నారు. కర్నూలు, నంద్యాల, మహబూబ్​నగర్​ జిల్లాల నుంచి ఉచిత వైద్య పరీక్షల కోసం వస్తుంటారని, వారందరికీ ఉచిత కన్సల్టెషన్​ ఆర్థోపెడిక్​ వైద్య పరీక్షలు అందజేస్తున్నామన్నారు. సంపాదించిన దానిలో కొంతైనా సేవకు వెచ్చించాలన్న ఆలోచనతోనే.. తన వంతుగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నానని పేర్కొన్న డా. రవితేజ రెడ్డి…. భవిష్యత్​లో మరిన్ని వైద్య సేవలు చేసేందుకు సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.

About Author