PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం.. క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

భ‌వ‌న నిర్మాణ రంగం కార్మికుల స‌మావేశంలో పాల్గొన్న టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  త‌మ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమ‌లుచేస్తామ‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. మౌర్య ఇన్‌లోని ప‌రిణ‌య హాల్‌లో జ‌రిగిన భ‌వ‌న నిర్మాణ కార్మికుల స‌మావేశంలో టి.జి భ‌ర‌త్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కార్మికుల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని రంగాలు వైసీపీ పాల‌న‌లో కుదేలైపోయాయ‌న్నారు. భ‌వ‌న నిర్మాణ సామాగ్రి, ముడి స‌రుకుల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయాయ‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి  అయితే ఇసుక ఉచితంగా అందిస్తామ‌ని తెలిపారు. భ‌వన నిర్మాణ కార్మికుల‌కు అన్నివిధాలా అండ‌గా ఉంటామ‌న్నారు. ఇక తన‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే క‌ర్నూలుకు ప‌రిశ్ర‌మ‌లు తీసుకొస్తాన‌ని చెప్పారు. కులం, మ‌తం చూడ‌కుండా ప్రజ‌లంద‌రూ ఓటు వేయాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన అసెంబ్లీ ఇంచార్జి అర్షద్, టిడిపి నాయకులు బొల్లెద్దుల రామకృష్ణ, దేవా, తదితరులు పాల్గొన్నారు.

About Author