PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వాతంత్ర సమరయోధుడు  రాయన్నను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి..ఎం.పి

1 min read

స్వాతంత్ర సమరయోధుడు సంగొల్లి రాయన్న జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎం.పి బస్తిపాటి నాగరాజు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్వాతంత్ర సమరయోధుడు సంగొల్లి రాయన్న ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు సూచించారు.. నగరంలోని రక్షా హాస్పిటల్ లో నిర్వహించిన రాయన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎం.పి , రాయన్న చిత్రపట్టానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని కిత్తూరు సామ్రాజ్యాన్ని కి సైన్య అధ్యక్షుడుగా ఉండి తెల్ల దొరల భరతం పట్టిన వీరుడు సంగొల్లి రాయన్న అని కొనియాడారు.. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన  రాయన్న జీవితం అందరికి స్ఫూర్తిదాయకమన్నారు.. ఈ కార్యక్రమంలో రక్షా హాస్పిటల్ అధినేత ఎం నాగరాజు, తెలుగు యువత మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కే. రామకృష్ణ తెలుగుదేశం పార్టీ కురువ సాధికారిక కమిటీ  జిల్లా కన్వీనర్ వెంకటరాముడు కురువ సంఘం నాయకులు సుధాకర్ బూడిదపాడు శ్రీనివాసులు,  బీచుపల్లి   తదితరులు పాల్గొన్నారు.

About Author